విద్యుదాఘాతంతో వైద్య విద్యార్థి మృతి | Medico dies due to Electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వైద్య విద్యార్థి మృతి

Jun 19 2015 2:48 PM | Updated on Oct 2 2018 6:27 PM

హోమియో వైద్య విద్యార్థి ఒకరు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు.

నెల్లిమర్ల (విజయనగరం) : హోమియో వైద్య విద్యార్థి ఒకరు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..  జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్న మిమ్స్ వైద్య కళాశాలలో వంశీకుమార్ అనే యువకుడు హోమియో ఫైనలియర్ చదువుతున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం కళాశాలకు సమీపంలోనే ఉండే తన గదిలో స్నానం చేయడానికి నీటి వాల్వ్ తిప్పగా దానికి కరెంట్ ఎర్త్ అయి షాక్‌తో పడిపోయాడు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్థారించారు. కాగా వంశీకుమార్ హైదరాబాద్ వాసి అని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement