సుఖేష్ గుప్తా రిమాండ్ పొడిగింపు | MBS Jewellers owner Sukesh Gupta Remand Extended to February 17 | Sakshi
Sakshi News home page

సుఖేష్ గుప్తా రిమాండ్ పొడిగింపు

Feb 3 2014 9:36 PM | Updated on Aug 2 2018 4:31 PM

ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ (ఎంబీఎస్) జ్యుయెలర్స్ డెరైక్టర్ సుఖేష్‌గుప్తా, ఎంఎంటీసీ సీనియర్ మేనేజర్ రవిప్రసాద్‌ల రిమాండ్‌ను సీబీఐ కోర్టు ఈనెల 17 వరకు పొడిగించింది.

హైదరాబాద్: బంగారం దిగుమతికి సంబంధించి మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)ను మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ (ఎంబీఎస్) జ్యూవెల్లర్స్ డెరైక్టర్ సుఖేష్‌గుప్తా, ఎంఎంటీసీ సీనియర్ మేనేజర్ రవిప్రసాద్‌ల రిమాండ్‌ను సీబీఐ కోర్టు ఈనెల 17 వరకు పొడిగించింది.

వీరి రిమాండ్ ముగియడంతో సోమవారం న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌ను పొడిగించారు. బంగారం దిగుమతి వ్యవహారంలో ఎంఎంటీసీకి రూ.194 కోట్లు నష్టం చేకూర్చారంటూ ఎంబీఎస్ డెరైక్టర్‌తోపాటు ఎంఎంటీసీకి చెందిన అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement