కుటుంబ కలహాలతో అనంతపురం జిల్లా లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ కలహాలతో వివాహిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఎన్పీ కుంట మండలం మదికొమ్మ దిన్నె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోనీ(25)కి ఇటీవల బాషాతో వివాహమైంది. కాగా.. వీరిద్దరి మధ్య మనస్తర్థలు తలెత్తడంతో.. మనస్తాపానికి గురైన సోనీ ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించేలోపే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.