గుత్తి మండలకేంద్రంలోని దాసరికాలనీలో పార్వతి(28) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
గుత్తి మండలకేంద్రంలోని దాసరికాలనీలో పార్వతి(28) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.