తీవ్ర వాయుగుండంగా మారిన ‘మాది’ | Madi stays 400 km from Machilipatnam in Bay of Bengal | Sakshi
Sakshi News home page

తీవ్ర వాయుగుండంగా మారిన ‘మాది’

Dec 12 2013 2:46 AM | Updated on Sep 2 2017 1:29 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘మాది’ తీవ్ర తుపాను బుధవారం ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘మాది’ తీవ్ర తుపాను బుధవారం ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. రానున్న 12 గంటల్లో అది మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బుధవారం రాత్రికి ‘మాది’ మచిలీపట్నానికి ఆగ్నేయ దిశగా 400 కి.మీ. దూరంలో కొనసాగుతోంది. నైరుతి దిశగా పయనించి మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో  రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 45నుంచి 65కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement