లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి | London Kaanuru student killed in train accident | Sakshi
Sakshi News home page

లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి

Sep 29 2014 2:16 AM | Updated on Sep 2 2017 2:04 PM

లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి

లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి

లండన్‌లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. కానూరులో ఉంటున్న ఇంజినీర్ దేవభక్తుని వినయ్‌కుమార్ కుమారుడు సుజిత్

పెనమలూరు : లండన్‌లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు.  కానూరులో ఉంటున్న ఇంజినీర్ దేవభక్తుని వినయ్‌కుమార్ కుమారుడు సుజిత్ ఈ నెల 21వ తేదీన లండన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు.

అక్కడినుంచి నివాసమండే రూమ్‌కు వెళ్లడానికి 22వ తేదీ సాయంత్రం లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ మాట్లాడుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుజిత్ మృతి చెందాడు.  అతడు ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేశాడు. సుజిత్ భౌతికకాయాన్ని సోమవారం వీరులపాడులో ఉంటున్న తాత దేవభక్తుని రామమోహనరావు ఇంటికి తీసుకొస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement