మరింత నాణ్యతతో శ్రీవారి లడ్డూ | Laddus of better quality, says TTD Executive Officer M.G.Gopal | Sakshi
Sakshi News home page

మరింత నాణ్యతతో శ్రీవారి లడ్డూ

Jan 23 2014 1:42 PM | Updated on Sep 2 2017 2:55 AM

టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం.జి.గోపాల్

టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం.జి.గోపాల్

శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో నాణ్యత మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఎం.జి.గోపాల్ గురువారం తిరుమలలో వెల్లడించారు.

శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో నాణ్యత మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఎం.జి.గోపాల్ గురువారం తిరుమలలో వెల్లడించారు. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యతను మరింత పెంచుతామన్నారు. బాలాజీ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ టెండర్ విధానంలో దశలవారిగా పారదర్శకతను అమలు చేస్తామన్నారు. అందుకోసం ఆ విధానంలో మార్పులు చేర్పులు చేపట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు ఎం.జి.గోపాల్ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement