ఏఎఫ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి! | Krishna mohan reddy is the new chairman of AFRC | Sakshi
Sakshi News home page

ఏఎఫ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి!

Nov 5 2013 3:18 AM | Updated on Jul 29 2019 5:28 PM

ఏఎఫ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి! - Sakshi

ఏఎఫ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి!

వృత్తివిద్యా కళాశాలల్లో అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గురిజాల కృష్ణమోహన్‌రెడ్డి నియమితులైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సాక్షి, హైదరాబాద్: వృత్తివిద్యా కళాశాలల్లో అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గురిజాల కృష్ణమోహన్‌రెడ్డి నియమితులైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం రాత్రి సంతకం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు మంగళవారం వెలువడనున్నట్టు సమాచారం. ఏఎఫ్‌ఆర్సీలో ఫీజు నిర్ధారణ కమిటీ, అడ్మిషన్ల నియంత్రణ కమిటీలు ఉంటాయి. ఫీజుల నిర్ధారణ కమిటీ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ ఆర్.బయ్యపురెడ్డి గత ఏడాది ఫిబ్రవరి 7న వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేశారు. దీంతో, అడ్మిషన్ల నియంత్రణ కమిటీ చైర్మన్ జస్టిస్ టి.రంగారావుకే ఈ కమిటీ బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ నేపధ్యంలో జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డిని ఫీజు నిర్ధారణ కమిటీ చైర్మన్‌గా నియమించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం వై.కొత్తపల్లి గ్రామానికి చెందినవారు. జిల్లా జడ్జిగా, ఏసీబీ కోర్టు జడ్జిగా పలు జిల్లాల్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement