సమాచారంలో జాప్యం సరికాదు | kodela shiva prasadarao meets chakrapani over budget session | Sakshi
Sakshi News home page

సమాచారంలో జాప్యం సరికాదు

Mar 4 2016 3:03 AM | Updated on Jul 29 2019 2:44 PM

శాసనసభ్యులు కోరిన సమాచారాన్ని సభలో అందించటంలో వివిధ శాఖలు విఫలం కావటం పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసంతృప్తి

సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులు కోరిన సమాచారాన్ని సభలో అందించటంలో వివిధ శాఖలు విఫలం కావటం పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు అవసరమైన సమాచారాన్ని అధికారులు సమకూర్చకపోతే దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు.

ఈ నెల ఐదో తేదీ నుంచి ఏపీ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణితో కలసి కోడెల వివిధ శాఖల అధిపతులు, పోలీసు అధికారులు, శాసనసభ సచివాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. 5న మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభ, మండలిలను ఉద్దేశించి గవర్నర్  ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. 10న  బడ్జెట్ ప్రవేశ పెడతారన్నారు. 19న బాబా రాందేవ్ ఎమ్మెల్యేలకు యోగాలో శిక్షణ ఇస్తారని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement