ఆంధ్ర విషనాగులకు విరుగుడు ఉంది | kodandaram blames seemandhra leaders | Sakshi
Sakshi News home page

ఆంధ్ర విషనాగులకు విరుగుడు ఉంది

Jan 4 2014 2:36 AM | Updated on Jul 29 2019 2:51 PM

తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా ఆంధ్ర విషనాగులు అడ్డుకుంటున్నాయని, ఆ విషానికి తమ వద్ద విరుగుడు ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
 
 హన్మకొండ, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా ఆంధ్ర విషనాగులు అడ్డుకుంటున్నాయని, ఆ విషానికి తమ వద్ద విరుగుడు ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) 19వ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో కోదండరాం మాట్లాడారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చిం చకుండా ఆంధ్ర విషనాగులను పాములోడు వచ్చి పట్టుకుపోతాడన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనీయకుండా చేసినా ఎలాంటి నష్టం ఉండబోదని చెప్పారు. అనంతరం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement