రేపటి నుంచి జేపీ నిరాహార దీక్షలు | JP hunger strikes From tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జేపీ నిరాహార దీక్షలు

Mar 2 2015 2:57 AM | Updated on Mar 9 2019 3:05 PM

రేపటి నుంచి జేపీ నిరాహార దీక్షలు - Sakshi

రేపటి నుంచి జేపీ నిరాహార దీక్షలు

రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలంటూ...

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలంటూ లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ మంగళవారం నుంచి రాష్ట్రంలోని వివిధ నగరాల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని ప్రకటనలో జేపీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి తగిన న్యాయం జరిగేంత వర కూ లోక్‌సత్తా పోరాటం చేస్తుందన్నారు.

మార్చి 3న అనంతపురంలో, 5న విశాఖపట్నంలో, 8న విజయవాడలో నిరాహార దీక్షలు చేస్తున్నట్లు జేపీ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement