కిరణ్ 'జై సమైక్యాంధ్ర' తొలి కార్యవర్గం భేటీ | Jai samaikyandhra party council first meeting | Sakshi
Sakshi News home page

'జై సమైక్యాంధ్ర' తొలి కార్యవర్గం భేటీ

Mar 12 2014 3:30 PM | Updated on Jul 29 2019 5:31 PM

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆవిర్భవించిన జై సమైక్యాంధ్ర పార్టీ తొలి కార్యవర్గం బుధవారం సమావేశమైంది.

రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆవిర్భవించిన జై సమైక్యాంధ్ర పార్టీ తొలి కార్యవర్గం బుధవారం సమావేశమైంది. కిరణ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు. మరోవైపు జై సమైక్యాంధ్ర తొలిసభ స్థానిక జెమినీ గ్రౌండ్స్లో ఈరోజు సాయంత్రం జరగనుంది.  ఈ సభలో ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్ కీలకంగా నిలవనుండగా మాజీమంత్రి పితాని సత్యనారాయణ, దాసరి నారాయణరావు, ఎమ్మెల్సీ బలసాలి ఇందిర హాజరు కానున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement