కెరమెరి, న్యూస్లైన్ : అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేసి కొత్తగా మంజూరు చేస్తామని, స్వయంగా నిర్మించుకోవాలని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ అన్నారు. గురువారం ఆయన మండలంలోని పిట్టగూడ(కే) గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సమస్యలపై పటేల్ మెంగును అడిగి తెలుసుకున్నారు. 2007లో 18 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా వాటి ఆనవాళ్లు లేకపోవడం, లబ్ధిదారులకు తెలియకుండానే రూ.26,200 డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉండడంపై పీవో గ్రామస్తులను ప్రశ్నించారు. అర్ధంతరంగా నిలిచిన నిర్మాణాలపై గృహ నిర్మాణ శాఖ వర్క్ఇన్స్పెక్టర్ అధికారి నిరల్ను అడిగారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీటీజీ కోటా కింద ఇళ్లు మంజూరు చేస్తామని, కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా లబ్ధిదారులే కట్టుకోవాలని సూచించారు. రోడ్డు సౌకర్యం లేదని, చెలిమెల నీరు తాగుతున్నామని గిరిజనులు చెప్పగా.. నీటి వసతి కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మతిన్ను ఆదేశించారు. ఎంతమంది చదువుకున్నారు, రేషన్కార్డులు ఎందరికి ఉన్నాయి, గ్రూపుల్లో ఎన్ని డబ్బులు పొదుపు చేశారు, బ్యాంకు రుణాలు, ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10వేల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ఎడ్లజతలు మంజూరు చేయాలని, పింఛన్ రావడం లేదని వికలాంగులు పీవో దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉట్నూర్కు వస్తే ఆదిలాబాద్లోని సదరం క్యాంపునకు తీసుకెళ్లి ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుడిపై ఆగ్రహం
ఉపాధ్యాయుడు పాఠశాల సక్రమంగా హాజరు కాకపోవడంపై పీవో జనార్దన్ నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికోసారి ఉపాధ్యాయుడు వస్తారని గ్రామస్తులు తెలిపారు. విద్యావాలంటీరు జైతు పాఠాలు బోధిస్తారని పేర్కొన్నారు. దీంతో ఎంఈవో మల్లయ్యను వివరాలు అడిగారు. ఇంట్లోనే ఉండమని చెప్పండి అంటూ మండిపడ్డారు. పాఠశాల భవనం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట సర్పంచ్ భీము, తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఏంపీడీవో సాజిద్ అలీ, ఎంఈవో మల్లయ్య, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మతిన్అహ్మద్, అధికారులు ఆత్మారాం, ప్రేంసింగ్ పాల్గొన్నారు.
అసంపూర్తి ఇందిరమ్మ ఇళ్లు రద్దు
Published Fri, Dec 6 2013 4:13 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement