వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ | increasing the growing popularity to YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ

Dec 16 2013 12:50 AM | Updated on May 25 2018 9:12 PM

సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంద

అమలాపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్లమెంటు నియోజక  వర్గ పరిశీలకుడు,ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. జిల్లా బీసీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు విత్తనాల సుబ్బారావు, యూత్ నాయకుడు విత్తనాల శేఖర్‌ల ఆధ్వర్యంలో అంబాజీపేట మండలానికి చెందిన సుమారు 200 మంది అమలాపురంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా చిట్టబ్బాయి నివాసంలో జరిగిన సభలో విత్తనాల సుబ్బారావు, శేఖర్, దొమ్మేటి వంశీ, చప్పిడి సతీష్, కాండ్రేగుల చంటి, చింతపల్లి దుర్గరాజు, సాకా త్రిమూర్తులతో పాటు పలువురికి విశ్వరూప్, చిట్టబ్బాయి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓట్లు, సీట్లు కోసం రాష్ర్ట విభజనకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, మందపాటి కిరణ్‌కుమార్, విప్పర్తి వేణుగోపాల్, జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కుడుపూడి సత్తిబాబు, పట్టణ, మండల కన్వీనర్లు మట్టపర్తి నాగేంద్ర, మద్దాల చంటిబాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాసరావు, మెల్లం ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు రాయుడు సత్తిబాబు, సర్పంచ్ కాండ్రేగుల గోపాలకృష్ణ, వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.
 అభివృద్ధిని అడ్డుకోవడం తగునా?
 ఉప్పలగుప్తం : అమలాపురం ఎంపీగా నియోజకవర్గ ప్రజల అవసరాలను తెలుసుకోని ఎంపీ హర్షకుమార్.. జరిగే అభివృద్ధిని అడ్డుకుంటూ, అధికారులపై ఆగ్రహించడంపై స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకులు పినిపే విశ్వరూప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్.కొత్తపల్లి పంచాయతీ రాఘవులపేటలో రూ.120 లక్షలతో నిర్మించిన తుపాన్ రక్షిత భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఎంపీ అడుగడుగునా అడ్డుతగులుతున్నారన్నారు.తుపాను రక్షిత భవన ప్రారంభానికి తయారు చేసిన శిలాఫలకాన్ని సైతం ఏర్పాటు చేయకుండా అధికారులకు ఆంక్షలు విధించారన్నారు. రాజమండ్రిలో ఉంటూ అనుచర గణంతో పెత్తనం చేయిస్తూ కయ్యాలకు కాలుదువ్వుతారే తప్ప కార్యకర్తలనూ పట్టించుకోరని విమర్శించారు.
 ఎన్ .కొత్తపల్లిలో  రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు
 రాజకీయాలకు అతీతంగా అమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, ఒక్క ఎన్.కొత్తపల్లిలోనే రూ. 4 కోట్ల అభివృద్ధి పను లు చేశామని విశ్వరూప్ పేర్కొన్నారు. జీఎస్‌పీసీ ద్వారా మత్స్యకారులకు రూ. నాలుగు కోట్లు మంజూరయ్యాయని, దాని జీవో కాపీ కూడా కలెక్టర్‌కు చేరిందన్నారు. తాను కాంగ్రెస్ నుంచి బయకుట వచ్చాననే కారణం తో ఆ జీవోను నిలుపుదల చేసి, కలెక్టర్‌ను సైతం బెదిరించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని పత్రికలకు విడుదల చేశారు. మరో నాలుగు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమం జరుగుతుందన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు లంకే రామకృష్ణవర్మ, బోడ్డు నాగేశ్వరరావు, నడింపల్లి వాసురాజు, మోటూరి సాయి, ఐవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement