అసంపూర్తిగా ముగిసిన సీఎం-విద్యుత్ జేఏసీ చర్చలు | Incomplete discussions between CM and Seemandhra electric JAC | Sakshi
Sakshi News home page

అసంపూర్తిగా ముగిసిన సీఎం-విద్యుత్ జేఏసీ చర్చలు

Oct 8 2013 4:22 PM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర జిల్లాల విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నేతలు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో  సీమాంధ్ర జిల్లాల విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నేతలు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమ్మె విరమించాలని జేఏసీ నేతలపై సీఎం తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే సీమాంధ్ర జిల్లాల జేఏసీ నేతలు మాత్రం  అందుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. చర్చలు మూడు గంటలకుపైగా కొనసాగాయి. అయినా ఫలితంలేదు.

రాష్ట్రం విభజించడంలేదని కేంద్రం నుంచి ప్రకటన వస్తేనే  సమ్మె విరమిస్తామని  జేఏసీ నేతలు తెగేసి చెప్పారు. మళ్లీ సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి మరోసారి జేఏసీ నేతలతో చర్చలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement