మూడు లారీల్లో ఆవులను గుంటూరులోని కబేళాకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
విజయవాడ (పడమట) : మూడు లారీల్లో ఆవులను గుంటూరులోని కబేళాకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన విజయవాడలోని ఏలూరు రోడ్డులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
మూడు లారీల్లో 80 ఆవులను తరలిస్తుండగా జ్ఞాన విజ్ఞాన వేదిక సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాడులు చేసి లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆవులను గుంటూరులోని గో సంరక్షణ కేంద్రానికి తరలించారు.