నర్సీపట్నం, న్యూస్లైన్: కౌలు రైతుల కోసం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన భూ ఆధీకృత చట్టంతో జిల్లాలో ఒనగూరిన ప్రయోజనం శూన్యంగానే కనిపిస్తోంది. దీంతో భవిషత్తులో వీరంతా సాగునకు దూరమయ్యే ప్రమాదముంది. జిల్లాలో అడపా, దడపా కురుస్తున్న వర్షాలకు రైతులు ఖరీఫ్ సాగు సన్నాహాల్లో ఉండగా, కౌలు రైతులు మాత్రం నాగలి పట్టేందుకు వెనుకంజవేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కౌలు రైతులే సాగు చేస్తున్నా, ప్రభుత్వ రాయితీలు, రుణాలను హక్కుదారులు పొందుతున్నారు. ఫలితంగా కౌలు రైతులు నష్టపోతున్నారు. అనధికార అంచనా ప్రకారం జిల్లాలో కౌలు రైతులు 2.50 లక్షల వరకు ఉన్నారు.
భూ అధీకృత చట్టం ప్రకారం వీరందరికీ గుర్తింపుకార్డులు ఇవ్వాల్సి ఉంది. కానీ మొదటి సంవత్సరం జిల్లాలో 15,439 మందికి మాత్రమే గుర్తింపు కార్డులిచ్చారు. వీరిలో 4,971 మందికి రూ.6.30 కోట్లు రుణాలను మంజూరు చేశారు. రెండో ఏడాది సుమారుగా ఐదు వేల మంది రైతులు గుర్తింపు కార్డులు రెన్యువల్ చేసుకున్నా వారిలో 357 మందికి రూ.68.45 లక్షల రుణాలిచ్చారు. రెండేళ్లుగా జిల్లాలో ప్రతికూల వాతావరణంతో పంటలు దెబ్బతిని, కౌలు రైతులు పూర్తిగా రుణాలు చెల్లించలేకపోయారు. రుణ చెల్లింపులను పరిగణలోనికి తీసుకున్న అధికారులు కొత్తగా గుర్తింపు కార్డులిచ్చేందుకు వెనుకంజవేశారు.
దీంతో ఈ ఏడాది 2,217 మంది కౌలు రైతులకు కొత్తగా గుర్తింపుకార్డులు మంజూరు చేయగా, 1,396 మంది పాత రైతులు మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 50 మంది కౌలు రైతులకు సుమారు రూ.7 లక్షల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ మంజూరు చేసే అన్ని పథకాలకు కౌలు రైతుల గుర్తింపుకార్డులు తప్పనిసరి. జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల మంది కౌలు రైతులు ఖరీఫ్ సాగు చేపడుతున్నా, వారిలో రెండు శాతం మందికే గుర్తింపుకార్డులు మంజూరు చేసింది. మిగిలిన 98 శాతం మంది రైతులకు గుర్తింపు కార్డులు లేక ప్రభుత్వ రాయితీలు, రుణాలకు దూరమవుతున్నారు.
కౌలు రైతులకు చుక్కెదురు!
Published Sun, Sep 1 2013 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement