కొత్త సర్పంచ్‌లకు ఐటీ నోటీసులు! | I-T notices served to newly elected sarpanches | Sakshi
Sakshi News home page

కొత్త సర్పంచ్‌లకు ఐటీ నోటీసులు!

Aug 27 2013 7:41 AM | Updated on Sep 1 2017 10:10 PM

ఐటీశాఖ కొత్త సర్పంచ్‌లపై దృష్టి పెట్టింది. నెల రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో నిధులకు సంబంధించిన లావాదేవీలపై కూపీలాగే ప్రయత్నంలో ఉంది.

సాక్షి, హైదరాబాద్: ఐటీశాఖ కొత్త సర్పంచ్‌లపై దృష్టి పెట్టింది. నెల రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో నిధులకు సంబంధించిన లావాదేవీలపై కూపీలాగే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా దాదాపు 250 మందికిపైగా సర్పంచ్‌లకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ వ్యాపారాలతో సంబంధ మున్న సర్పంచ్‌లే ప్రధానంగా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి ఐటీ అధికారులు వివరాలు కోరినట్లు సమాచారం. మరోవైపు ఐటీ శాఖ సర్పంచ్‌ల బ్యాంక్ లావాదేవీలపై కూడా దృష్టి పెట్టింది. ఏయే మార్గాల్లో ఆదాయం సమకూరిందనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఆదాయం పన్ను విభాగం జాబితాలో ఉన్న 180 మంది సర్పంచ్‌లు తమ ఎన్నిక కోసం కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలుస్తోంది. ఈ సొమ్ముకు ఆదాయపుపన్ను చెల్లించారా? తదితర వివరాలు ఐటీ అధికారులు రాబడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement