ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది మంగళవారం లెక్కించారు.
అప్పన్న హుండీ లెక్కింపు
Aug 1 2017 2:34 PM | Updated on Sep 11 2017 11:01 PM
సింహాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది మంగళవారం ఉదయం లెక్కించారు. గడిచిన 20 రోజులకు గాను రూ. 70,21,195 నగదుతో పాటు 61 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి భక్తులు సమర్పించినట్లు ఈవో కోడూరి రామచంద్రమోహన్ తెలిపారు.
శ్రావణ మాసం కావడంతో భక్తుల రాక మరింత పెరిగే అవకాశముందని... ప్రతి శుక్రవారం మహిళలను దృష్టిలో పెట్టుకుని ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కల్యాణ మండపాలన్నీ రద్దీగా ఉన్నాయని.. వాటి కారణంగా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
Advertisement
Advertisement