ఐపీఎస్ అధికారుల బదిలీలకు సిఫారసు చేసిన పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు (పీఈబీ)కే ఏవైనా అభ్యంతరాలున్నా చెప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) విస్మయం వ్యక్తం చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారుల బదిలీలకు సిఫారసు చేసిన పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు (పీఈబీ)కే ఏవైనా అభ్యంతరాలున్నా చెప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) విస్మయం వ్యక్తం చేసింది. బదిలీ చేసిన బోర్డునే అప్పిలేట్ ఫోరంగా పరిగణించాలనడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా తనను బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ కర్నూలు ఎస్పీ కె.రఘురామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్ విభాగం ఇన్చార్జ్ జస్టిస్ పి.స్వరూప్రెడ్డి, సభ్యులు రంజనా చౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.