జూనియర్ డాక్టర్ల(జూడా)సమ్మెపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలోని జూడాలకే వర్తిస్తుందని, తమకు వర్తించదని ఏపీ జూడాల సంఘం నేతలు పేర్కొన్నారు.
ఏపీ జూనియర్ డాక్టర్ల వెల్లడి
విజయవాడ: జూనియర్ డాక్టర్ల(జూడా) సమ్మెపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ లోని జూడాలకే వర్తిస్తుందని, తమకు వర్తించదని ఏపీ జూడాల సంఘం నేతలు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం నుంచి ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. తమ డిమాండ్లపై వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తొలుత చర్చిద్దామన్నారని, రెండోసారి సీఎంని కలిసి చర్చిద్దామని చెప్పారని, మూడోసారి కలిసినప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారం నడుచుకుందామన్నారని, ఈ ప్రతిపాదనలో అర్థం లేదని జూడా నేతలు అన్నారు.