మృతురాలు వైద్యురాలిగా గుర్తింపు | Heavy rains in nellore district | Sakshi
Sakshi News home page

మృతురాలు వైద్యురాలిగా గుర్తింపు

Dec 1 2015 10:51 AM | Updated on Oct 20 2018 6:04 PM

ఎడతేరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మంగళవారం అతలాకుతలమైంది.

నెల్లూరు : ఎడతేరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మంగళవారం అతలాకుతలమైంది. సూళ్లురుపేటలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం 67 టీఎంసీలకు చేరింది. డక్కలి సమీపంలో వరదలో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం ఈరోజు ఒడ్డుకు చేరుకుంది.  సదరు మహిళ మృతదేహం వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మిగా స్థానికులు గుర్తించారు.

అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.... పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement