మహిళా రక్షణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దేశంలో ప్రతి 22 నిమిషాలకో బాలిపై లైంగికదాడి జరుగుతోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపారాణి ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతపురం సిటీ, న్యూస్లైన్ : మహిళా రక్షణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దేశంలో ప్రతి 22 నిమిషాలకో బాలిపై లైంగికదాడి జరుగుతోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపారాణి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో ‘మహిళలు-హింస’ అనే అంశంపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రోజు రోజుకూ మహిళలపై హింస అనేక రూ పాల్లో పెచ్చుమీరిపోతోందన్నారు. అన్ని వర్గాల, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హింసను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి 75 నిమిషాలకు ఒక మహిళపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చినా దాడులు ఆగడంలేదన్నారు.
చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. కేసుల వాదనకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలన్నారు. దాడులు ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలన్నారు. స్కూల్లో ఒకటో తరగతి నుంచి కరాటే విద్యను నేర్పించాలన్నారు. వెయ్యిమంది బాలురకు 917 మంది బాలికలు ఉన్నారని, మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతోందన్నారు. ఉపాధి కోసం పట్టణాలకు, నగరాలకు వెళుతున్న మహిళలను వ్యభిచారగృహాలకు పంపుతున్నారన్నారు. దీనిపై మహిళలను చైతన్య వంతులు చేసేందుకు ఐద్వా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, లోక్సత్తా జిల్లా ఉపాధ్యక్షురాలు సరస్వతి, ఐద్వా నాయకురాళ్లు రామాం జనమ్మ, అరుణ, చంద్రిక, లక్ష్మిదేవి, లక్ష్మి, ఉమా, సరల, రమీజా, తులసమ్మ, భాగ్య,దిల్షాద్, రేణుకా తదితరులు పాల్గొన్నారు.