విజయనగరం (మక్కువ) : ‘ప్రేమించానన్నాడు. ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. కట్నం పేరుతో ఇప్పుడు అడ్డం తిరిగాడు. కట్నం కింద రూ.పది లక్షలు, భూమిని రాసిస్తేనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు’ అంటూ మండల కేంద్రం మక్కువలోని గుళ్లమజ్జివీధికి చెందిన ఉషారాణి వాపోయింది. సోమవారం తన తల్లిదండ్రులు కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.
తాను విజయనగరంలో కంప్యూటర్ కోర్సులో కోచింగ్ తీసుకుంటుండగా రామభద్రపురం మండలం తారాపురం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తుమరాడ గోవిందతో ఏడాదిన్నర కిందట పరిచయమైందని చెప్పిం ది. గత ఏడాది డిసెంబర్ 8న రైల్వే పరీక్షలను రాసేందుకు విశాఖపట్నంలో వెళ్లగా గోవింద కూడా తనతో వచ్చాడని, అనంతరం విజయనగరం తీసుకెళ్లి కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి లొంగదీసుకున్నాడని తెలిపింది.
ఈ ఏడాది జూన్ 22న గోవింద తన కుటుంబ సభ్యులను తన ఇంటికి తీసుకొచ్చి నిశ్చితార్థం చేసుకున్నాడని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తన తల్లిదండ్రులు లక్ష రూపాయల అడ్వాన్సు కూడా అందించాని ఉషారాణి తెలిపింది. ఇంతలో గోవింద పెళ్లి ఇష్టం లేదని, నీకన్నా అందమైన అమ్మాయి, కట్నం అధికంగా ఇచ్చే వారు ఉన్నారని వేధించసాగాడని వాపోయింది. రూ.10 లక్షలకట్నం, తన పేరున ఉన్న భూమిని ఇస్తేనే పెళ్లిచేసుకుంటానని వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. గోవిందపై కేసు నమోదు చేయవద్దని, తనతో వివాహం చేస్తే చాలని ఉషారాణి విజ్ఞప్తి చేసింది.
ఇదే విషయమై ఈ నెల 4న విజయనగరంలో ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చే యగా ఆ సమయంలో ఎస్పీ బయటకు వెళ్లారని తెలిపింది. దీంతో ఈ నెల 18న మళ్లీ గ్రీవెన్స్లో ఎస్పీకు ఫిర్యాదు చేయడంతో మక్కువ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అక్కడ అధికారులు తెలిపినట్లు ఆమె వివరించింది. ఈ నెల 22న మక్కువ పోలీస్స్టేషన్కు వెళ్లి సమస్య వివరించింది. కాగా, సోమవారం సాలూరు సీఐ దేముళ్లు మక్కువ పోలీస్స్టేషన్కు చేరుకొని విచారణ చేపట్టారు.
ప్రేమించాడు 'గోవింద'... పెళ్లంటే గోవిందా...
Published Tue, Aug 26 2014 9:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- నీకు మొగుడు లేడా..? టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement