విశాఖ స్టీల్ప్లాంట్లో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి | Gas leak in Vizag Steel Plant, two dead | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్ప్లాంట్లో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి

Jun 16 2014 12:51 PM | Updated on Aug 25 2018 6:06 PM

విశాఖ స్టీల్ఫ్లాంట్లోని ఎస్ఎంఎస్-2 విభాగంలో సోమవారం కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీకై ఇద్దరు మృతి చెందారు.

విశాఖ : విశాఖ ఉక్కు కర్మాగారంలో మరోసారి ప్రమాదం జరిగింది. స్టీల్ఫ్లాంట్లోని ఎస్ఎంఎస్-2 విభాగంలో సోమవారం కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అవటంతో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. మృతులు సీమాడ్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు అనీష్, రజనీష్గా గుర్తించారు.

 

మృతుల్లో ఒకరు తమిళనాడుకు చెందినవారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. మరోవైపు స్టీల్ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు భద్రతా చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement