సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో విడత సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన తంబళ్లపల్లెలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్లో రోడ్షోలో పా ల్గొంటారు. తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది.
జిల్లాలోకి ఆయన ప్రవేశించే ప్రాంతంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. జగన్మోహన్రెడ్డి రాక కోసం తంబళ్లపల్లె నియోజకవర్గం ఎదురుచూస్తోంది. ఆయన వచ్చే మార్గానికి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్రెడ్డి నవంబర్ 29వ తేదీన కుప్పం నుంచి యాత్రను ప్రారంభించారు. కుప్పం, పలమనేరుల్లో తొలి విడత యాత్రను పూర్తి చేశారు. రెండో విడత యాత్ర డిసెంబరు 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చేపట్టారు. పలమనేరు నుంచి ప్రారంభ మైన రెండో విడత యాత్ర పుంగనూరు మీదుగా మదనపల్లె వరకు సాగింది. మూడో విడత తంబళ్లపల్లె నుంచి ప్రారంభం కానుంది.
ఈ పర్యటనలో భాగంగా పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఆదివారం 15 ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించనున్నారు. నాయనబావి, గుట్ట, ఉలవలవారిపల్లెలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారమే తంబళ్లపల్లెకు చేరుకున్నారు.
నేటి పర్యటన ఇలా...
ఉదయం 9.00 గంటలకు తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. బెంగళూరు నుంచి జిల్లాలోని ప్రవేశించే ఆయన ముందుగా శంకరాపురంలో సుబహాన్ సాహెబ్ కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడ నుంచి బి.కొత్తకోట, కొండకిందపల్లె, గుట్ట, పట్రవారిపల్లె, గట్టుపాళెం, నాయనబావి, ఉలవలవారిపల్లె, పయపుగారిపల్లె, పత్తిరెడ్డిగారిపల్లె, చేదబావిపల్లె, తోకలపల్లె, శీలంవారిపల్లెలో సమైక్య శంఖారావం యాత్రలో పాల్గొంటారు. తర్వాత కనికలతోపు, కోటిరెడ్డిగారిపల్లె, కాండ్లమడుగు క్రాస్ మీదుగా కంచెవారిపల్లె, చెన్నామర్రిమిట్ట, దొమ్మనమ్మబావి, అంగళ్లులో పర్యటిస్తారు. అంగళ్లులో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కురబలకోటలో రోడ్షో నిర్వహించి, తిరిగి అంగళ్లు చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేస్తారని ప్రోగామ్ కో-ఆర్డినేటర్ తలసిల రఘురాం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు.
నేటి నుంచి మూడో విడత జగన్ సమైక్య శంఖారావం
Published Sun, Jan 5 2014 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement