ఖమ్మం అర్బన్, న్యూస్లైన్: ‘వారిలాగా మేము స్థలం ఆక్రమించి ఇల్లు కట్టలేదు. మా ఇంటికి పక్కాగా రిజిస్ట్రేషన్ పత్రాలున్నాయి. మాకేమవుతుంది..?’ అని ఇప్పటిదాకా ధీమాగా ఉన్న కొందరు ఇళ్ల, స్థల యజమానులు.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఖమ్మంలోని సాగర్ కాల్వలను ఆక్రమించి నిర్మించిన గుడిసెల తొలగింపు కార్యక్రమం శనివారం పార్శీబంధం, ముస్తఫానగర్, శ్రీరామ్నగర్, ధంసలాపురం తదితర ప్రాంతాల్లో కొనసాగింది.
కాల్వ సరిహద్దులను గుర్తిస్తూ, దాని పరిధిలోని ఇళ్లు, నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ వేయిస్తున్నారు. ఇలా మార్కింగ్ వేసేంతవరకు.. తమ ఇల్లు కాల్వ పరిధిలో ఉందన్న విషయం తెలియని అనేకమంది లబోదిబోమంటున్నారు. కాల్వ స్థలాలను కొందరు రియల్ వ్యాపారులు ఆక్రమించి, వాటిపై ఇళ్లు నిర్మించి, మున్సిపల్ కార్యాలయం నుంచి ఇంటి నంబర్ తీసుకుని, రిజిస్ట్రేషన్ చేయించి లక్షల రూపాయలకు విక్రయించారు. అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లల్లో కొన్నింటికి ఇప్పటికే రెండు మూడు రిజిస్ట్రేషన్లు జరిగినవి కూడా ఉన్నాయి.
వీటిని తాము లక్షల రూపాయలకు కొన్నామని, దారుణంగా మోసపోయామని వీటి కొనుగోలుదారులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు లోనవుతున్నారు. కళ్లెదుటే గూడు చెదిరిపోతుంటే.. తట్టుకోలేక గుండె చెరువవవుతోంది. కొందరు లోలోనే కుమిలిపోతుంటే.. మరికొందరు భోరుమని విలపిస్తున్నారు. కూల్చివేతకు వచ్చిన అధికారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపిస్తూ.. ‘రియల్ వ్యాపారుల మోసానికి బలయ్యాం.
మా కష్టార్జితమైన లక్షల రూపాయలను వారికి పువ్వుల్లో పెట్టిచ్చి... మేమేమో ఇలా రాళ్లు, ఇటుకల శిథిలాలు మిగుల్చుకున్నాం’ అంటూ, గోడు వినిపించారు. కొందరు రాజకీయ నాయకులుగా, రియల్ వ్యాపారులుగా చలామణవుతూ అనేకమంది అమాయకులను ఇలా మోసగించారన్న బాధితులు తీవ్ర ఆగ్రహావేశం వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాటి కూల్చివేతలను ఆర్డీఓ సంజీవరెడ్డి, డీఎస్పీ బాలకిషన్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్, తహశీల్దార్ ఆశోక్ చక్రవర్తి పర్యవేక్షించారు.
గృహ ప్రవేశం జరిగి నెల కూడా కాలేదు...
శనివారం ఇల్లు కోల్పోయిన బాధితుల్లో ఒకరి పరిస్థితి మరీ దారుణం. ఆ ఇంటి యజమాని నెల రోజుల కిందటే ఓ ఇంటిని లక్షల రూపాయలకు కొన్నారు. గృహ ప్రవేశం జరిగి నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే అధికారులు వచ్చి, అది ఆక్రమిత స్థలంలో ఉందంటూ మార్కింగ్ చేసి వెళ్లారు. ఇలా ఇళ్లు కోల్పోయిన వారిలో ఛత్తీస్గఢ్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు కూడా ఉన్నారు.
తమ కుటుంబీకుల రెక్కల కష్టంతో ఎన్నో ఏళ్ల కిందట కొన్న ఇళ్లను కూల్చివేస్తుండడాన్ని చూస్తూ భోరున విలపించారు. కూల్చివేతను పర్యవేక్షించేందుకు వచ్చిన కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఎవి.రంగనాథ్కు తమ గోడు చెప్పుకుని, దిక్కెవరంటూ కన్నీటితో ప్రశ్నించారు.
కోర్టు స్టేతో నిలిచిన తొలగింపు
పార్శీబంధం, ముస్తఫానగర్ ప్రాంతంలో కాల్వల పరిధిలోగల కొన్ని ఇళ్ల యజమానులు ముందస్తుగా కోర్టును ఆశ్రయించి (తొలగింపు నుంచి మినహాయింపునకు) స్టే తెచ్చుకున్నారు. వీటికి సర్వే అధికారులు మార్కింగ్ చేసి, స్టే ఆర్డర్ నంబర్లు వేశారు.
మార్కింగ్ వేస్తే...గూడు చెదిరినట్టే
Published Sun, Jan 26 2014 5:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement