బిచ్కుందలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.
నిజామాబాద్: బిచ్కుందలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. జుక్కల్ చౌరస్తా వద్ద ఆటో ఒకటి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులంతా మద్నూర్ మండలం లక్ష్మాపూర్ వాసులుగా గుర్తించారు.