గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

Flight Delay At Gannavaram Airport - Sakshi

సాక్షి, గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం గన్నవరం నుంచి ముంబయి వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం రాలేదు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించగా ఉదయం 9.30 నిమిషాలకు రావాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం 5 గంటలకు రానుందని వారు తెలిపారు.

తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 10 గంటలకే ముంబయి చేరుకోవాల్సిన తమకు ఇంత అసౌకర్యం కలుగుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదంటూ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top