చిట్టీల పేరుతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది.
చిట్టీల పేరుతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. ధర్మవరం పట్టణంలోని తిక్కస్వామినగర్కు చెందిన గొల్ల నర్సింహులు 5 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. సుమారు 100 మంది నుంచి రూ. లక్ష నుంచి 4 లక్షల వరకు వసూలు చేసి పరారయ్యాడు. సుమారు రూ.కోటి 20 లక్షలు తీసుకొని పరారయినట్లు బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.