- బరిలో మువ్వా, దేవానందరెడ్డి, శామ్యూల్
- తననే కొనసాగించాలంటూ ఇన్చార్జ్ డీఈవో పైరవీలు
- మంత్రులకూ సవాలుగా మారిన వ్యవహారం
సాక్షి, చిత్తూరు: జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు కోసం నలుగురు ఢీ అంటే ఢీ అంటున్నారు! ఎవరి పరిధిలో వారు ప్రయత్నాలు సాగి స్తున్నారు. గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేసిన మువ్వా రామలిం గం, పాడేరు ఐటీడీఏ అధికారి దే వానందరెడ్డి, మదనపల్లె డెప్యూటీ డీఈవో, ప్రస్తుత ఇన్చార్జ్ డీఈవో శామ్యూల్, ఓ మహిళా అధికారి తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. వారిలో ఒకరికిజిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ మద్దతు పలుకుతున్నట్లు ప్రచారంలో ఉంది.
జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వర్గాలుగా విడిపోయి డీఈవో పోస్టు కోసం పైరవీలు నెరుపుతున్నట్లు తెలిసింది. దీంతో డీఈవో పోస్టు బేరం భారీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేసిన మువ్వా రామలింగం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వక పోవడంతో ఖాళీగా ఉన్నారు. చిత్తూరు డీఈవోగా రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఆయనకు రాష్ర్ట మంత్రి నారాయణ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితుడు కావడంతో రామలింగం భరోసాతో ఉన్నారని సమాచారం. రామలింగం గతంలో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పనిచేసిన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పనిచేస్తుండగా ఆయనను కలెక్టర్ సస్పెండ్ చేయడంతో పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నారు. ఇదిలావుండగా పాడేరులో ఐటీడీఏలో పనిచేస్తున్న దేవానందరెడ్డి డీఈవోగా రావడానికి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆశీస్సులు కోరినట్లు సమాచారం.
శ్యామ్యూల్ ముమ్మర యత్నం !
ప్రస్తుతం ఇన్చార్జ్ డీఈవోగా ఉన్న శామ్యూల్ రెగ్యులర్ పోస్టులోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీఈవో ప్రతాప్రెడ్డి కడపకు బదిలీ కావడంతో మదనపల్లి డెప్యూటీ డీఈవోగా ఉన్న శ్యామ్యూల్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆయన మంత్రి బొజ్జలతో పాటు, జెడ్పీ చైర్పర్సన్, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొంటున్నట్లు తెలుస్తోంది.
ఓ మహిళా ప్రిన్సిపాల్ కూడా...
డీఈవో పోస్టు కోసం ఓ మహిళా ప్రిన్సిపాల్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన కొందరు అధికారపార్టీ నేతలు ఆమెకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో డీఈవో పోస్టు ఖరీదుగా మారినట్లు సమాచారం.
డీఈవో పోస్టుకు ఫైటింగ్ !
Published Mon, Dec 8 2014 2:40 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement