ఎస్కేయూ వద్ద నీరాజనం | farmer Ensuring expedition YS Jagan Mohan Reddy, | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ వద్ద నీరాజనం

Jun 6 2016 3:12 AM | Updated on Oct 1 2018 3:56 PM

ఎస్కేయూ వద్ద నీరాజనం - Sakshi

ఎస్కేయూ వద్ద నీరాజనం

రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి....

ఎస్కేయూ : రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి  శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ఆదివారం ఘనస్వాగతం పలికారు. ఓడీసీ మండలంలో రైతు భరోసా యాత్ర ముగించుకొని అనంతపురం వస్తున్నారనే విషయం తెలుసుకుని జోరు వానలో తడుస్తూ జగన్ కోసం నిరీక్షించారు. అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల వద్దకు జగన్ కాన్వాయ్ చేరుకోగానే అనంతపురం రూరల్ మండలం వైఎస్సార్ విద్యార్థి యూనియన్ అధ్యక్షుడు ఎం.చిరంజీవి, ఇటుకలపల్లి సర్పంచ్ ఎ.పెద్దిరెడ్డి, నాయకులు ఎన్.శివారెడ్డి, ఎం.క్రిష్టప్ప, మధుశేఖర్ నేతృత్వంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వందలాది బైక్‌లతో అనంతపురం నగరం వరకు ర్యాలీ కొనసాగింది. వర్షంలో తన కోసం నిరీక్షిస్తున్న విద్యార్థి నాయకులను జగన్ పేరుపేరునా పలకరించారు.


 ప్రతి పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్ కల్పించాలి
 ప్రతి పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్ కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు కోరారు. ఎస్కేయూ వీసీ నియంతృత్వ విధానాలు అమలు చేస్తూ విద్యార్థుల హక్కులు, స్వేచ్ఛను కాలరాస్తున్నారని పేర్కొన్నారు. రెండో పీజీ చేసే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం లేదని తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్‌కు ఓ వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.వి.లింగారెడ్డి, గెలివి నారాయణరెడ్డి, భానుప్రకాష్, విజయ్, తిరుమలేశ్, శ్రీనివాస్ రెడ్డి, గోవర్దన్ తదితరులు జగన్‌కు వినతిపత్రం అందించిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement