ఎస్సై కొట్టాడని మనస్తాపంతో.. | Farmer attempts suicide | Sakshi
Sakshi News home page

ఎస్సై కొట్టాడని మనస్తాపంతో..

Sep 6 2015 9:58 AM | Updated on Oct 1 2018 2:44 PM

గుడుంబా తయారుచేస్తున్నాడనే నెపంతో ఒక వ్యక్తిని పోలీసులు చితకబాదారు.

బనగానపల్లి (కర్నూలు) : గుడుంబా తయారుచేస్తున్నాడనే నెపంతో ఒక వ్యక్తిని పోలీసులు చితకబాదారు. దీంతో అతను మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం చిన్నరాజుపాలెం తండాలో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. చిన్నరాజుపాలెం తండా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటేష్ నాయక్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా ఆదివారం ఉదయం అతని ఇంటికి వచ్చిన పోలీసులు సారా తయారు చేసి విక్రయిస్తున్నాడనే ఆరోపణతో తీవ్రంగా కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement