నిన్న అండ.. నేడు గుదిబండ | Even yesterday .. Today I've | Sakshi
Sakshi News home page

నిన్న అండ.. నేడు గుదిబండ

Jun 16 2014 1:19 AM | Updated on Jul 28 2018 6:35 PM

పాయకరావుపేట నియోజకవర్గంలో 2012లో చంద్రబాబు నిర్వహించిన మీ కోసం యాత్రలో పెట్రోకెమికల్ అండ్ పెట్రో ఇన్వెస్ట్‌మెంట్ రీజీయన్(పీసీపీఐఆర్)కు వ్యతిరేకంగా పోరాడతానన్నా రు.

నక్కపల్లి : పాయకరావుపేట నియోజకవర్గంలో  2012లో  చంద్రబాబు నిర్వహించిన మీ కోసం యాత్రలో పెట్రోకెమికల్ అండ్ పెట్రో ఇన్వెస్ట్‌మెంట్ రీజీయన్(పీసీపీఐఆర్)కు వ్యతిరేకంగా పోరాడతానన్నా రు. భూముల కోసం వచ్చే అధికారులను చెట్లకు కట్టాలని పిలుపు నిచ్చారు. ఇప్పుడేమో మాటమారుస్తున్నారు. పీసీపీఐర్ మాస్టర్‌ప్లాన్, ముసాయిదాను ఏడాది క్రితమే ప్రభుత్వం విడుదలచేసింది.

విశాఖ,తూర్పుగోదావరిజిల్లాలో 10 మండలాల్లో 97గ్రామాలను ఇం దులో చేరుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిం ది. జిల్లాలో పెదగంట్యాడ,పరవాడ,అచ్చుతాపురం, రాంబిల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లిమండలాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో యు.కొత్తపల్లి,తొండంగి, కాకినాడరూరల్ మండలాలు ఉన్నాయి.

ఈ ప్రాంతాల్లో 40 శాతం ప్రాసెసింగ్ జోన్ గా పారిశ్రామిక అవసరాలకోసం విని యోగిస్తారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుమారు రూ.3.3లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావి స్తోంది. ఇప్పటికే జీఎమ్మార్ కన్సార్టియం నుంచి రూ.33వేల కోట్ల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. పీసీపీఐఆర్‌లో క్లస్టర్‌గా ఉన్ననక్కపల్లి మండలంలోతీరప్రాంత గ్రామాల్లో వేలాది ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలచేసింది.
 
నాలుగేళ్ల నుంచి ఆయా గ్రామాల్లో భూము ల క్రయవిక్రయాలను ఆపేశారు.అమ్ముకునేందుకు, కుదువపెట్టుకునేందుకు రైతులకు అధికారం లేకుండా పోయింది. పీసీపీఐఆర్‌పై అభిప్రాయ సేకరణను రైతులంతా వ్యతిరేకించారు. భూములు వదిలేప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశంనేతలు కూడా అప్పట్లో నిలిచారు.

ప్రజాసంఘాలు, ఉభయకమ్యూనిష్టుపార్టీలు,చేతి,కులవృత్తిసంఘాలు ఇప్పటికీ దీనిని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నాయి. పీసీపీఐఆర్ ఏర్పాటుతో కోనసీమను తలపించే ఈ ప్రాంతమంతా పెట్రోరసాయనపరిశ్రమలతో విషతుల్యమవుతుందని జనం ఆందోళన చెందుతున్నారు. వాయు కాలుష్యం వల్ల జనం అనేక రుగ్మతలకు గురికావడంతో పాటు, జీవనోపాధి కోల్పోతారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాబు ప్రకటనతో రైతులకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.
 
 మాటమార్చడం తగదు
 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు రైతులకు అండగా నిలుస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు మాటమార్చడం తగదు. 2012లో మీకోసం యాత్రలో పీసీపీఐఆర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి ఇప్పుడు అత్యుత్తమ పెట్రోసీమ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటు. ఎన్ని ఇబ్బందులెదురైనా పీసీపిఐఆర్ ఏర్పాటును వ్యతిరేకిస్తాం. రైతులకు అండగా నిలుస్తాం.             - అప్పలరాజు, సిపిఎం నాయకులు
 
 బాబుది రెండు నాల్కల ధోరణి
 చంద్రబాబు రెండునాల్కలధోరణి అవలంబించడం తగదు. మీకోసం యాత్రలో భూములను సేకరించేందుకు వచ్చిన అధికారులను చెట్లకు కట్టాలని రైతులను రెచ్చేగొట్టేవిధంగా ప్రకటనలు చేశారు. ఇప్పుడు అదే అధికారులతో భూములు ఎలా సేకరిస్తారో చూస్తాం. రెతులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా పోరాటానికి సిద్ధం.
 - వీసంరామకృష్ణ, వైఎస్సార్‌సిిపి నాయకుడు
 
 రైతులంతా కూలీలవుతారు
 ఏళ్లతరబడి ఇవే భూములపై ఆధారపడిజీవిస్తున్నాం. భూములు లాక్కొని పరిశ్రమలు ఏర్పాటుచేస్తే రైతులంతా కూలీలుగా మారతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీసీపీఐర్ ఏర్పాటును అంగీకరించే ప్రసక్తిలేదు. అవసర మైతే ఆందోళన చేపడతాం.    
 - లొడగల చంద్రరావు, రైతు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement