సీమకు ఖర్చు చేస్తారన్నది అనుమానమే
ఏపీ సివిల్ సొసైటీ ప్రతినిధుల సదస్సులో కుసుమకుమారి
తిరుపతి సిటీ : కేంద్రం నుంచి వచ్చిన ప్రతి సహాయమూ కోస్తా జిల్లాల వైపే వెళుతోందని, రాయలసీమ వైపు రాని వ్వడం లేదని ఎస్కే యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ పి.కుసుమకుమారి అన్నారు. ప్రభుత్వ దృష్టి అంతా అమరావతి వైపే ఉందని, ప్రత్యే హోదా, ప్రత్యేక ప్యాకేజీల్లో రాయలసీమకు ఎంత ఖర్చు చేస్తారన్నది అనుమానమేనని పేర్కొన్నారు. ఏసీ సివిల్ సొసైటీ ప్రాంతీయ సదస్సు తిరుపతి యూత్ హాస్టల్లో జరిగింది. సదస్సును ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఏర్పడిన ఏపీ సివిల్ సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సదస్సులను నిర్వహిస్తోందని తెలిపారు.
అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే మళ్లీ అభివృద్ధిని కేంద్రీకరించడం బాధాకరమన్నారు. ఏపీ సివిల్ సొసైటీ ప్రాంతీ య కన్వీనర్ భూమన్ మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని తెలి పారు. శివరామకృష్ణన్ నివేదికను కూడా లెక్కచేయకుండా భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రాంతంలో రాజధాని కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని రాజధాని చేయడం వల్ల కోస్తా జిల్లాల వారంతా తనకు ఓట్లేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అలా చేస్తున్నారని ఆరోపించా రు. సీమలో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి వలసపోతున్నారని సీనియర్ జర్నలిస్ట్ జగన్నాథనాయుడు తెలిపారు. రాజధాని పేరుతో 33వేల ఎకరాల పంట పొలాలను లాగేసుకున్నారని, మరో 55వేల ఎకరాల అటవీ భూమిని తీసుకోబోతున్నారని, భవిష్యత్తులో ప్రాణవాయువు కూడా కరువైపోతుందని అన్నారు. నీటి వాటా సాధనలో సీమ వెనుకబడడం వల్ల భాషాపరంగా, సాంస్కృతికంగా సీమ వాసులు చిన్నచూపునకు గురవుతున్నారని మరో సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ అన్నా రు. ఇన్ని అన్యాయాలు చూశాక విడిపోదామన్న బలమైన కోర్కె మేధావుల్లో, చదువుకున్న వారిలో కలుగుతోందని సామాజిక కార్యకర్త పురుషోత్తంరెడ్డి అన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ సుబ్రమణ్యంరెడ్డి, డాక్టర్ సుధాకర్రెడ్డి, గ్రామ వికాస సంస్థ ప్రతినిధి రాంబా బు, హేతువాది ఊట్ల రంగనాయులు, చలపతి, రామ్మూర్తి, వెంకటరమణ, సీనియర్ జర్నలిస్ట్ సొదుం రమణారెడ్డి, విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్నారు.
ప్రతి పైసా కోస్తా జిల్లాల వైపే
Published Mon, Nov 2 2015 2:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement