
‘స్వచ్ఛంద’ మోసం
స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. న
ఉద్యోగాల పేరుతో టోకరా
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
సుమారు రూ.10 లక్షల మేరకు వసూలు చేశారని ఆరోపణ
ఐదు జిల్లాల్లో మోసపోయిన నిరుద్యోగులు
చౌడేపల్లె: స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. నగదు వసూలుచేసి మోసం చేసిన సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. బాధితులు శుక్రవారం చౌడేపల్లె పోలీసులకు ఫిర్యాదుచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె మండలం చారాలకు చెందిన కొందరు యువకులు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. కుప్పంలో బ్రాంచ్ని ఏర్పాటుచేసి 40 మంది నిరుద్యోగులను గుర్తించి ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. వారికి పశువులకు సోకే వ్యాధుల నివారణపై సుమారు 40 రోజులపాటు కుప్పంలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన యువకులు వచ్చారు. ఆ సమయంలో నిరుద్యోగులు సొంత ఖర్చులతోనే గడిపారు. ఆ తర్వాత శిక్షణ పూర్తయ్యిందని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.5 వేలు వసూలు చేశారు. నాబార్డు పథకం ద్వారా తమ సంస్థకు నిధులు వస్తాయని, ఎవరి గ్రామాల్లో పశువుల వ్యాధులు నయం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి పంపారు. టెక్నీషియన్ పోస్టులోఉన్నవారికి రూ.7,500, సూపర్వైజర్కు రూ.13 వేలు జీతం చెల్లిస్తామని చెప్పారు. ఉద్యోగం ఇచ్చామని చెప్పి గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. విధి నిర్వహణలో భాగంగా మొబైల్ సర్వీసుకోసం అందరూ ఫైనాన్స్లో మోటా ర్ సైకిళ్లు కొన్నారు. ఆ తర్వాత మూడు నెలలైనా స్టయిఫండు లేదు. జీతమూ రాలేదు. చివరకు శుక్రవారం చౌడేపల్లె పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సూపర్వైజర్ పోస్టు కోసం రూ:35 వేలు తీసుకొన్నారు
నాకు సూపర్ వైజర్ పోస్టు కేటాయిస్తున్నామని చెప్పి రూ:35 వేలు ఇవ్వాలని సంస్థ నిర్వాహకులు డిమాండు చేయడంతో చెల్లించాను. ఉద్యోగం లేదు.. చివరికి అప్పులే మిగిలాయి.. ఎలాగైనా న్యాయం చేయాలి
-రెడ్డెప్ప, పాలింపల్లె, చౌడేపల్లె మండలం.
నమ్మితే నిలువునా ముంచేశారు
పేదకుటుంబంలో పుట్టిన మాకు మాసొంత గ్రామాల్లోనే ఉద్యోగాలిచ్చి జీతాలిస్తామంటే వారిని నమ్మి నిలువునా మోసపోయాం. బమా ప్రాంతంలో ఎనిమిది మందికి ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు చేశారు. మాలాగా మోసపోయిన వారు ఇంకా చాలామంది ఉన్నారు.
-సునీల్కుమార్, ప్రొద్దుటూరు, వైఎస్సార్జిల్లా.
06పిజిఆర్33జెపిజి: చౌడేపల్లెలో పోలీసులకు ఫిర్యాధుచేస్తున్న బాధితులు.
06పిజిఆర్34జెపిజి: చౌడేపల్లెలో మోసపోయిన బాధితులు
06పిజిఆర్35జెపిజి: డబ్బులు తీసుకొన్నతరువాత సంస్థవారు ఇచ్చిన రశీదు
06పిజిఆర్36జెపిజి: జారీ చేసిన గుర్తింపు కార్డులు
06పిజిఆర్37జెపిజి: రెడ్డెప్ప, పాలింపల్లె, చౌడేపల్లె మండలం.
06పిజిఆర్38జెపిజి: సునీల్కుమార్, పొద్ద్రుటూరు, వైఎస్సార్జిల్లా.