కరెంట్ షాక్‌తో యువకుని మృతి | electric shock kills youngster in chittor | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో యువకుని మృతి

Oct 27 2015 7:48 PM | Updated on Jul 29 2019 5:43 PM

చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలం గుడిసెవారిపల్లిలో మంగళవారం విద్యుదాఘాతంతో ఒక యువకుడు మృతిచెందాడు.

మదనపల్లి రూరల్(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలం గుడిసెవారిపల్లిలో మంగళవారం విద్యుదాఘాతంతో ఒక యువకుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన బాలాజీ(30) టాటాఏస్ వాహనంలో పాలు సరఫరాచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు. ఇంట్లో మంగళవారం సాయంత్రం స్నానంచేసి ఇనుప వైరుపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

మృతునికి భార్య సంధ్య ఉంది. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది.

Advertisement
 
Advertisement
Advertisement