డ్రోన్‌ కెమెరా కలకలం | Drone camera was caught on the tree branches and fell down near Venkaiah | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ కెమెరా కలకలం

Aug 27 2017 12:54 AM | Updated on Jul 28 2018 3:41 PM

డ్రోన్‌ కెమెరా కలకలం - Sakshi

డ్రోన్‌ కెమెరా కలకలం

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో డ్రోన్‌ కెమెరా కలకలం రేపింది.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో డ్రోన్‌ కెమెరా కలకలం రేపింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఓపెన్‌టాప్‌ జీపులో ర్యాలీగా బయల్దేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు దారి పొడవునా అభివాదం చేసుకుంటూ వచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు ఈ ర్యాలీని పైనుంచి డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారు.

ఏలూరు రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రికి ర్యాలీ చేరుకోగానే రహదారి పక్కనున్న చెట్టు కొమ్మల్లో డ్రోన్‌ కెమెరా చిక్కుకుంది. దీన్ని తప్పించేందుకు ఆపరేటర్లు ప్రయత్నాలు చేస్తుండగానే వెంకయ్య ప్రయాణిస్తున్న వాహనం సమీపించింది. అదే సమయంలో డ్రోన్‌ కెమెరా పైనుంచి ఒక్కసారిగా కుప్పకూలి వెంకయ్యకు అతి సమీపంలోనే పడింది. దీంతో ప్రముఖులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఊహించని ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement