సాక్షి, అమరావతి: చెప్పిన మాట ప్రకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పెన్షన్ను సోమవారం నుంచి రూ.2,250కు పెంచుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం పింఛన్దారులకు లేఖ రాశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ లేఖ ప్రతులను పింఛన్దారులకు అందజేయనున్నారు. పెంచిన పింఛన్ను అర్హులందరికీ అందజేస్తామని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. లేఖలోని వివరాలు...
ప్రియమైన అవ్వాతాతలకు, అక్కాచెల్లెళ్లకు, దివ్యాంగ సోదర సోదరీమణులకు..
మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నా. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని చెప్పిన మాట ప్రకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(సోమవారం) నుంచి మీ పెన్షన్ను రూ.2,250కు పెంచుతున్నాం. పెంచిన పెన్షన్లను వైఎస్సార్ పెన్షన్ కానుక కింద అందిస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధి బాధితులకు ఈ పెంపు వర్తిస్తుంది. నాలుగు నెలల క్రితం వరకు రూ.1,000 మాత్రమే అందిన పెన్షన్ను రూ.3,000 వరకు పెంచుకుంటూ పోతాం. దివ్యాంగులకు నెలకు రూ.3,000 చొప్పున పంపిణీ చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్ మొత్తాన్ని నెలకు రూ.10,000కు పెంచాం.
ఈ సందర్భంగా అవ్వాతాతలకు, అక్కా చెల్లెళ్లకు, దివ్యాంగ సోదర సోదరీమణులందరికీ హామీ ఇస్తున్నా. ఇకపై మీకు జన్మభూమి కమిటీల వేధింపులు ఉండవు. పెన్షన్ మంజూరుకు గానీ, పెన్షన్ ప్రతినెలా ఇచ్చేటప్పుడు గానీ గతంలో మాదిరిగా లంచాల బాధ ఉండదు. మీ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చి మీ చేతికే అందుతుంది. అంతేకాదు పెన్షన్ పొందే వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. పెన్షన్ల మంజూరు విషయంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, మీరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారని కూడా చూడం. పెంచిన పెన్షన్ను అర్హులందరికీ ఇస్తాం. ఈ పెన్షన్ను రూ.3,000
వరకూ తీసుకుపోతాం.’’
చెప్పిన మాట ప్రకారమే పెన్షన్
Published Mon, Jul 8 2019 4:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement