రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ వార్డెన్ మృతి | Deputy Warden killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ వార్డెన్ మృతి

Oct 16 2013 2:49 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఇంటి ఎదుట నిలబడిన డిప్యూటీ వార్డెన్‌ను తాగిన మైకంలో టాటా ఏస్ వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడు చికిత్స పొందుతూ

ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : ఇంటి ఎదుట నిలబడిన డిప్యూటీ వార్డెన్‌ను తాగిన మైకంలో టాటా ఏస్ వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. డిప్యూటీ వార్డెన్‌గా పనిచేస్తున్న పోడెం ఆనందరావు(45)కు రెండు రోజులుగా జ్వరం వస్తోంది. చికిత్స చేయించుకోవడానికి కుమారుడు జీవన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై మండల కేంద్రానికి వెళ్లాడు. అక్కడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంటి ఎదుట నిలబడి ఉన్న ఆనందరావును తాగిన మైకంలో టాటా ఏస్ వాహన డ్రైవర్ ఢీకొట్టాడు.
 
 దీంతో తలకు బలమైన గాయం కావడంతో నోట్లో నుంచి రక్తం పడింది. కుమారుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు  వెంటనే ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యుడు ఆనందరావు పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే వరంగల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆనందరావు కన్నుమూశాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మంగపేట మండలం కోమటిపల్లి బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్‌గా ఆనందరావు పనిచేస్తున్నారు. కాగా, టాటా ఏస్ డ్రైవర్ రషీద్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement