సాక్షి, సంగారెడ్డి: బోగస్ మెడికల్ రీయింబర్స్మెంట్ వ్యవహారంలో 12 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ జిల్లా విద్యాశాఖను ఆదేశించింది. లేని రోగాలకు వైద్య చికిత్సలు చేయించుకున్నట్లు వైద్య బిల్లులు సృష్టించి నిధులను కొల్లగొట్టిన వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏజీ కార్యాలయం జరిపిన ఆడిట్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల సహకారంతో బోగస్ బిల్లులు సృష్టించి అక్రమంగా మెడికల్ రీయింబర్స్మెంట్ నిధులను సొమ్ముచేసుకున్నట్టు తేలింది. చికిత్స జరిగినట్లు బిల్లుల్లో పేర్కొన్న తేదీల్లో సదరు ఉపాధ్యాయులు సెలవుల్లో ఉండాల్సి ఉండగా, విధులకు హాజరైనట్లు హాజరు పట్టికల్లో సంతకాలు చేసి ఉండడంతో ఈ బండారం బయటపడింది.
ఏజీ ఆడిట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలతోపాటు పాఠశాల విద్యాశాఖ అంతర్గతంగా విచారణ జరిపాయి. ఈ క్రమంలో జిల్లాలో 12మంది ఉపాధ్యాయులు అడ్డంగా దొరికిపోయారు. సిద్దన్నపేట(నంగనూరు) ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఎం. వెంకటి రూ.1,70,586, పీర్లపల్లి(జగదేవ్పూర్) ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ పి.రాజేశ్వరి రూ.1,73,055, నల్టూరు(జిన్నారం) ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీ కె.శశిధర్ రూ.21,218, మోటకింది తండా(మెదక్) ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ పి.శశికుమార్ రూ.19,598, జానకంపేట్(పటాన్చెరు) ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ పి.రామనరసింహరెడ్డి రూ.20,959 వైద్య బిల్లులను అక్రమంగా సొమ్ము చేసుకున్నారు.
అదేవిధంగా కుసంగి(టేక్మాల్) జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు కె.కృష్ణారెడ్డి రూ.19,743, హంసాన్ పల్లి (కొల్చారం) జడ్పీహెచ్ఎస్ ఎస్ఏ ఎం.శ్రీనివాస్ రూ.21,852, సదాశివపల్లి(కౌడిపల్లి) ప్రాథమికోన్నత పాఠశాల ఎస్ఏ ఈ.యాదగిరి రూ.43,735, లక్ష్మాపూర్(రామాయంపేట) జడ్పీహెచ్ఎస్ ఎస్ఏ డి.దయానందరెడ్డి రూ. 22,392, రాంచంద్రాపురం జడ్పీహెచ్ఎస్ ఎస్ఏ బి.కృష్ణాగౌడ్ రూ.21,595, రంగంపేట్(కొల్చారం) జడ్పీహెచ్ఎస్ ఎస్ఏ సయ్యద్ అజీజ్అలీ రూ. 19,562, మెదక్ ఉన్నత పాఠశాల(కొత్త) ఎస్ఏ సయ్యదా అస్మాషాహీన్ రూ. 21,664 అక్రమంగా పొందినట్లు అప్పట్లో రుజువువైంది. 2010లో జరిగిన ఈ విచారణ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతోపాటు వందలమంది సస్పెండయ్యారు.
వైద్య బిల్లుల రికవరీలూ అప్పట్లో చేపట్టారు. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ ఉపాధ్యాయులపై ఆరోపణలు నమోదు చేశారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని అప్పట్లో ప్రభుత్వం విద్యాశాఖకు సూచించింది. దీంతో జిల్లాలో బాధ్యులైన 12మందిపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నియమావళి అనుబంధం-1లోని ఆర్టికల్ 300నుంచి 302ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టాలని డీఈఓను ఆదేశిస్తూ పాఠశాల విద్యశాఖ కమిషనర్, డెరైక్టర్ వాణీమోహన్ ఈనెల 21న ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిఫారసుల మేరకు ఐపీసీ 403, 409, 129(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు సదరు ఉపాధ్యాయులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.
12 మంది టీచర్లపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం
Published Wed, Sep 25 2013 5:00 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఈవీఎం ట్యాంపరింగ్ పై రాహుల్ గాంధీ, మస్క్ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్లో ఎన్కౌంటర్: నలుగురి మావోయిస్టులు మృతి
Train Accident: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
తప్పక చదవండి
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement