నకిలీల స్థానాల్లో కొత్తవారికి | Counterfeiting positions apprentices | Sakshi
Sakshi News home page

నకిలీల స్థానాల్లో కొత్తవారికి

Mar 24 2016 2:35 AM | Updated on Sep 3 2017 8:24 PM

డీఎస్సీ-2014లో ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల కు అర్హత సాధించిన 1,200 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను ...

26మంది డీ ఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
రాష్ట్ర విద్యాశాఖ నుంచి అందిన  జాబితా


చిత్తూరు(గిరింపేట): డీఎస్సీ-2014లో ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల కు అర్హత సాధించిన 1,200 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను ఇటీవల విద్యాశాఖ పరిశీలించిన విషయం విధితమే. ఇందులో   26 మంది సర్టిఫికెట్లు నకిలీవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆ జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు పంపారు. వారు ఆ జాబితాను పక్కనబెట్టి కొత్త జాబితాను మంగళవారం రాత్రి డీఈవో కార్యాలయానికి పంపారు. ఈ క్రమంలో ఆ జాబితాలోని అభ్యర్థులు బుధవారం సాయంత్రం లోగా ఒరిజిన ల్ సర్టిఫికెట్లతో డీఈవో కార్యాలయానికి చేరుకోవాలని వారి సెల్‌ఫోన్లకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సందేశం పంపారు.

 
26 మంది అభ్యర్థులలో ఎస్జీటీలు 18 మంది, ల్యాంగ్వేజ్ పండిట్లు(హిందీ)-01, (తెలుగు)-05, వికలాంగులు - 2 ఉన్నట్లు డీఈవో కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను డీఈవో నాగేశ్వరరావు సమక్షంలో డీఎస్సీ సెక్షన్ సూపరింటెండెంట్ పురుషోత్తం, సిబ్బంది కుమార్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement