దుర్గమ్మ హుండీ లెక్కింపులో చోరీ! | contract staff try to snatch gold of goddes kanakadurga | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ లెక్కింపులో చోరీ!

Feb 19 2015 6:05 PM | Updated on Sep 2 2017 9:35 PM

కనకదుర్గ దేవస్థానం హుండీ లెక్కింపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.

కనకదుర్గ దేవస్థానం హుండీ లెక్కింపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. దేవస్థానంలో ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీలను లెక్కిస్తారు. దీనిలో భాగంగానే హుండీ కలెక్షన్లను లెక్కిస్తుండగా ఓ ఉద్యోగి అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారు మంగళసూత్రాలను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు.

సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడిని ఆలయ అధికారులు గుర్తించారు. కాంట్రాక్టు సిబ్బంది సుబ్బారావు టీ కప్పులో నాలుగు గ్రాముల బరువున్న మంగళ సూత్రాలను వేసుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీటీవీలో గుర్తించి అతడిని పట్టుకున్నారు. మొదట ఆలయ అధికారులు అతడిని విచారించి, తర్వాత విజయవాడ వన్టౌన్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement