అవినీతిరహిత పాలనకు కలసిరండి: బాబు | come for Corruption-free governance says babu | Sakshi
Sakshi News home page

అవినీతిరహిత పాలనకు కలసిరండి: బాబు

Mar 1 2015 3:28 AM | Updated on Aug 14 2018 11:24 AM

అవినీతి రహిత పాలన అందించడానికి కలసిరావాలని సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. దానికి జేఏసీ నేతలు సానుకూలంగా స్పంది ంచారు.

సాక్షి, హైదరాబాద్: అవినీతి రహిత పాలన అందించడానికి కలసిరావాలని సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. దానికి  జేఏసీ నేతలు సానుకూలంగా స్పంది ంచారు. అశోక్‌బాబు, ఐ.వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కత్తి నరసింహారెడ్డి, రఘురామిరెడ్డితో కూడిన జేఏసీ ప్రతి నిధి బృందం శనివారం సీఎంతో భేటీ అయింది.
 
 ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వివిధ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఉద్యోగ నేతలకు బాబు సూచించారు. పనిలేని విభాగాల్లో సిబ్బందిని తగ్గించి, ఒత్తిడి ఎక్కువగా ఉన్న శాఖలకు బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.ఈ సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని జేఏసీ నేతలు సీఎంకు హామీ ఇచ్చారు. తకు హెల్త్‌కార్డులిచ్చి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
 
మరో రెండు నెలలు మెడికల్ రీయింబర్స్‌మెంట్

హెల్త్‌కార్డుల పథకం అమల్లో ఉన్నా కార్పొరేట్ వైద్యం సక్రమంగా అందడం లేదని, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను మరికొంత కాలం కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు  చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం  స్పందించింది. ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement