కనీస వేతనాలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలన్న ప్రధాన డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. సుమారు ఐదు గంటలపాటు కార్యాలయం ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి ఓబులు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు మారిన మనిషనని చెప్పుకున్నా... ఆయన మారని మనిషే అని ఇప్పుడు నిరూపించుకుంటున్నారని విమర్శించారు.
అనంతపురం అర్బన్ : ‘నేను మారిన మనిషినని.. అంగన్వాడీని బలోపేతం చేస్తా.. మీ కష్టాల్లో పాలుపంచుకుంటా’ అని ఎన్నికల్లో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబా బు మిహ ళలను మోసం చేశారని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఓబులు విమర్శించా రు. కనీవ వేతనాలు, రాజకీయ వేధింపులు, తదితర డిమాండ్లపై సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్థానిక ఆర్డీవో కా ర్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. సీఎం డౌన్.. డౌన్.. ము ఖ్యంత్రికి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మండుటెండలో దాదాపు నాలుగు గంటలపాటు మహిళలు బైఠాయించారు. ముట్టడిని ఉద్దేశించి ఓబు లు మాట్లాడుతూ రాష్ర్ట ఆర్థిక బడ్జెట్లో అంగన్వాడీ కార్యకర్తల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఎన్నటికీ మారరని ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేసినవారిపై గుర్రాలతో తొక్కించాడు.. వాటర్ క్యాన్లు విసిరించాడని చంద్రబాబు పాలనలో సా గిన అరాచకాన్ని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఐసీడీఎస్ ప్రాజెక్టును బలోపేతం చేస్తామంటూనే ప్రధాని నరేం ద్రమోదీ బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించారన్నారు. గత ప్రభుత్వం ఐసీడీఎస్ కు రూ. 16 వేల కోట్లు బడ్జెట్లో కేటాయిం చగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అందులో సగానికి తగ్గించి కేవలం రూ.8 వేల కోట్లను మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు.
ముట్టడికి యత్నం... పలువురి అరెస్టు : డీఎస్పీ విజయ్కుమార్, సీఐ గోరంట్ల మాధవ్ నేతృత్వంలో ఒక్కసారిగా పోలీస్ బలగాలు ఓబుల, ఇంతియాజ్, నల్లప్పతో పాటు మరికొంతమంది సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేయబోయారు. దీంతో పోలీసులకు, సీఐటీయూ నాయకులకు తీవ్ర తోపులాట జరిగింది. ఓబుల ప్రతిఘటించినప్పటికీ పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించా రు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, కార్యదర్శి సావిత్రమ్మలను మహిళ పోలీసు లు అరెస్ట్ చేయడానికి రాగానే మహిళలు వారిని చుట్టముట్టారు.
జైలుకు వెళ్లాడానికై న సిద్ధంగా ఉన్నాం.. అంటూ.. తీవ్ర స్థాయి లో పోలీస్ చర్యలకు నిరసన వ్యక్తం చేశారు. పట్టువదలని అంగన్వాడీ ఉద్యోగులు ఆర్డీ ఓ కార్యాలయం ముట్టడికి యత్నించారు. లక్ష్మిదేవి, సావిత్రమ్మ, సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి రెండో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్నిపోశారు. ఆడపిల్లలులేని ఆయనకు తమ కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. లేకపోతే సరైన గుణపాఠం నేర్పుతామని శాపనార్థాలు పెట్టారు. ఈ నెల 17నరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైదరాబాద్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.
బాబు మారని మనిషి
Published Sat, Mar 14 2015 2:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement