ఏపీకి హోదాపై కొద్ది రోజుల్లో ప్రకటన | central minister arjun ram about ap special status | Sakshi
Sakshi News home page

ఏపీకి హోదాపై కొద్ది రోజుల్లో ప్రకటన

Aug 17 2016 1:36 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీకి హోదాపై కొద్ది రోజుల్లో ప్రకటన - Sakshi

ఏపీకి హోదాపై కొద్ది రోజుల్లో ప్రకటన

ఏపీకి ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ అన్న విషయాన్ని కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ వెల్లడించారు.

కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ వెల్లడి
వన్‌టౌన్ (విజయవాడ): ఏపీకి ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ అన్న విషయాన్ని కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ వెల్లడించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మంగళవారం విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రిని రాష్ట్ర వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ దుర్గాఘాట్‌లోని వీఐపీ ఘాట్‌కు తీసుకొచ్చారు. మంత్రి కృష్ణా నదికి నమస్కరించి నీటిని తలకు రాసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలు భారతీయ ఔన్నత్యాన్ని చాటే గొప్ప కార్యక్రమమన్నారు. ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దీనిపై పార్లమెంటులో ఇటీవల సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. ఏపీకి అన్ని విధాల సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement