క్విడ్ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు | CBI files Three charge sheets in ys Jaganmohan Reddy assets case | Sakshi
Sakshi News home page

క్విడ్ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు

Sep 10 2013 2:50 PM | Updated on Apr 4 2018 9:25 PM

క్విడ్ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు - Sakshi

క్విడ్ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు

క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ మంగళవారం మూడు చార్జ్షీట్లు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్స్కు సంబంధించిన ఈ మూడు చార్జ్షీటులు వేసింది.

హైదరాబాద్ : క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ మంగళవారం మూడు  చార్జ్షీట్లు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్స్కు సంబంధించిన ఈ మూడు చార్జ్షీటులు వేసింది. నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందున... సీబీఐ ఈ  ఛార్జ్షీటులను గగన్ విహార్లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయితే ఎనిమిది, తొమ్మిది తేదీలు సెలవులు కావటంతో సీబీఐ అధికారులు నేడు చార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ సీబీఐ అయిదు చార్జ్ షీట్లు దాఖలు చేసింది. కాగా సీబీఐ డిఐజి వెంకటేశ్‌ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి 15 నెలలుగా జైల్లో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement