ఎంపీ మాగంటి బాబు ఆఫీస్‌లో పేకాట.. ఎస్పీ ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 25 2017 8:08 PM

card game in mp maganti babu offfice - Sakshi

సాక్షి, కృష్ణా: తెలుగుదేశం ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా... జూదం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేసిన ఘటనగా తాజాగా కలకలం రేపుతోంది. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావుకు చెందిన కృష్ణా జిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. 5వేల రూపాయలు రిజిస్ట్రేషన్‌ ఛార్జీగా వసూలు చేసి... కనీసం 5 లక్షల రూపాయలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ జూదం నిర్వహిస్తున్నారు. ఇందులో రోజుకు  12 కోట్ల రూపాయల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఎంపీ మగంటి బాబు కార్యాలయంలో పేకాట కొనసాగుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఎంపీ మగంటి తీరుపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ఈ మేరకు 'సాక్షి' ప్రచురించిన కథనాలపై జిల్లా పోలీసులు స్పందించారు. ఎంపీ మాగంటి బాబు కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపారు. నెలల తరబడి పేకాట శిబిరం నడుస్తున్నా.. ఎందుకు పట్టించుకోలేదని స్థానిక పోలీసులపై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement