రాష్ట్ర ఎన్నికల కమిషన్కు జగన్ లేఖ
‘స్థానికం’లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఫిర్యాదు
13న జరిగే స్థానిక ఎన్నికల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించాలని విజ్ఞప్తి
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు, అధికార దుర్వినియోగం, అరాచకాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 13న జరగనున్న జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ అధ్యక్ష పదవుల ఎన్నికలకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు. వైఎస్సార్ సీపీ సభ్యులను దౌర్జన్యంగా లాక్కుని వెళుతున్నా, టీడీపీ నేతలతో కుమ్మక్కయి చోద్యం చూస్తూ ఉండిపోయిన జిల్లా కలెక్టర్, ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్ రాసిన లేఖను పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, శాసన సభాపక్షం ఉప నేతలు ఉప్పులేటి కల్పన, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, కోన రఘుపతి, ఆదిమూలం సురేష్ తదితరులు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంతరెడ్డికి అందజేశారు. స్థానిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడి, అధికారులకు విధి నిర్వహణలో అడ్డు తగిలిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ ద్వారా ఆయా జిల్లా కలెక్టర్లకు పంపిన ఆదేశాల ప్రతిని రమాకాంతరెడ్డి వైఎస్సార్ సీపీ నేతలకు అందజేశారు. అధికారులకు అడ్డుతగిలిన వారి మీద కేసులు పెడతామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు : మైసూరారెడ్డి
స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు ఇచ్చి బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వాటిని బలహీనపర్చే విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని మైసూరారెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషనర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కళ్ల ముందే టీడీపీ వారు దౌర్జన్యానికి పాల్పడుతుంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బలహీనులుగా చేష్టలుడిగి చూస్తూ కూర్చోవడం ఏమిటని ప్రశ్నించారు.
టీడీపీ గుర్తింపును రద్దు చేయాలి
Published Thu, Jul 10 2014 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement