వేరుశెనగ వ్యాపారి ఆత్మహత్య | businessman suicide in ysr district | Sakshi
Sakshi News home page

వేరుశెనగ వ్యాపారి ఆత్మహత్య

Aug 27 2015 11:20 AM | Updated on Nov 6 2018 7:56 PM

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యాపారి బలవన్మరణం చెందాడు.

ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యాపారి బలవన్మరణం చెందాడు. పట్టణానికి చెందిన కట్టమీది రామకృష్ణారెడ్డి(53) స్థానికంగా వేరుశెనగ వ్యాపారం చేస్తుంటాడు. గురువారం వేకువజామున ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులోని పాలకేంద్రం ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అతనికి అప్పుల బాధ కూడా లేదని, ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలియటం లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. రామకృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement